ఎంపీగా టాలీవుడ్ హీరోయిన్..
- May 25, 2019
ఎంపీగా పోటీ చేసిన మొదటి ప్రయత్నంలోనే అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్. ఆర్పి పట్నాయక్ అంధుడిగా నటించిన చిత్రం శీను వాసంతి లక్ష్మి చిత్రంలో నటించిన కౌర్ తన నటనకు గాను ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఆమె కూడా రాజకీయాల్లో ప్రవేశించింది. మహారాష్ట్ర అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి శివసేన పార్టీ అభ్యర్థిపై 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. భర్త రాణా మొదటి నుంచి యువ స్వాభిమాన్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. కౌర్ కూడా అదే పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొంది లోకసభలో అడుగుపెట్టనుంది. ఆమెకు 5 లక్షల 10 వేల ఓట్లు పోలయ్యాయి. కౌర్ భర్త రవి రాణా యోగా గురు బాబా రాందేవ్కు మేనల్లుడు. 2011లో 3100 మందికి జరుగుతున్న సామూహిక వివాహ మహోత్సవంలో రవి రాణా, నవనీత్ కౌర్ జంట కూడా ఒకటి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







