ఎంపీగా టాలీవుడ్ హీరోయిన్..
- May 25, 2019ఎంపీగా పోటీ చేసిన మొదటి ప్రయత్నంలోనే అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్. ఆర్పి పట్నాయక్ అంధుడిగా నటించిన చిత్రం శీను వాసంతి లక్ష్మి చిత్రంలో నటించిన కౌర్ తన నటనకు గాను ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఆమె కూడా రాజకీయాల్లో ప్రవేశించింది. మహారాష్ట్ర అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి శివసేన పార్టీ అభ్యర్థిపై 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. భర్త రాణా మొదటి నుంచి యువ స్వాభిమాన్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. కౌర్ కూడా అదే పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొంది లోకసభలో అడుగుపెట్టనుంది. ఆమెకు 5 లక్షల 10 వేల ఓట్లు పోలయ్యాయి. కౌర్ భర్త రవి రాణా యోగా గురు బాబా రాందేవ్కు మేనల్లుడు. 2011లో 3100 మందికి జరుగుతున్న సామూహిక వివాహ మహోత్సవంలో రవి రాణా, నవనీత్ కౌర్ జంట కూడా ఒకటి.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్