ఐఓసీ ప్యానెల్ మెంబర్గా షేకా హయాత్
- May 27, 2019
బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బిఓసి) బోర్డ్ మెంబర్, విమెన్స్ స్పోర్ట్ కమిటీ ఛెయిర్ విమెన్ షేకా హయాత్ బింట్ అబ్దుల్ అజీజ్ అల్ ఖలీఫా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ విమెన్ ఇన్ స్పోర్ట్ కమిషన్ కొత్త మెంబర్గా నియమితులయ్యారు. గతంలో షేకా హయాత్ ఐఓసీ అథ్లెట్స్ ఎంటరేజ్ కమిషన్ మెంబర్గా వరుసగా రెండు పర్యాయాలు పనిచేశారు. తదుపరి టెర్మ్కి సంబంధించి 32 మంది కొత్త సభ్యులతో కలిసి షేకా హయాత్ కొత్త పదవి చేపట్టబోతున్నారు. లిడియా న్సెకెరా ఆఫ్ బురుంది ఈ కమిషన్ ఛెయిర్ విమెన్గా పనిచేస్తారు. జోర్డాన్కి చెందిన ప్రిన్స్ ఫైసల్ బిన్ అల్ హుస్సేన్ వైస్ ఛైర్మెన్గా వ్యవహరిస్తారు. కాగా, బిఓసి సెక్రెటరీ జనరల్ మెహమ్మద్ అల్ నుసుఫ్, షేకా హయాత్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..