ఏజెంట్ చేతిలో మోసపోయిన 35 మంది భారతీయ వలసదారులు
- May 27, 2019
భారతదేశంలోని కర్నాటకకు చెందిన 35 మంది భారతీయ కార్మికులు ఎంప్లాయ్మెంట్ ఫ్రాండ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ప్లేస్మెంట్ ఏజెన్సీ ద్వారా కువైట్కి తాము వెళ్ళినట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఒక్కొక్కరి దగ్గరనుంచి సదరు సంస్థ 65,000 రూపాయలు వసూలు చేసిందని చెప్పారు బాధితులు. కువైట్ చేరుకున్న తర్వాతగానీ బాధితులకు తాము మోసపోయిన విషయం తెలియలేదు. ఆరు నెలలుగా కువైట్లో సమస్యలు ఎదుర్కొంటున్నామనీ, తకు జీతాలు సరిగ్గా రాలేదని బాధితులు పేర్కొంటున్న వీడియో ఒకటి వెలుగు చూసింది. కంపెనీ తమను మోసం చేసిందనీ, కువైట్ జైళ్ళలో మగ్గేలా చేస్తామని బెదిరిస్తోందనీ వాపోయారు. విధి నిర్వహణలో నలుగురు కార్మికులు గాయపడినా, వారిని కంపెనీ ఆదుకోలేదని ఓ బాధితుడు చెప్పారు. బాధితుల వెతలకు సంబంధించిన వీడియో చూసిన మంగళూరు సౌత్ ఎమ్మెల్యే వేద వ్యాస్ కామత్, వారికి సాయం చేసేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. బాధితులంతా మంగళూరుకి చెందినవారే.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!