వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ఎం.ఇ.సి.
- January 02, 2016
ఖతర్ లో 2015 ఏడాది లో ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వినియోగదారుల పరిరక్షణ శాఖ ( ఎం.ఇ.సి.) మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నట్లు సంబంధిత శాఖ పేర్కొంది. స్థానిక అరబిక్ దినపత్రిక ఆర్రయహ్ తెలిపిన వివరాల ప్రకారం , గత ఏడాది 537 వినియోగదారుల ఉల్లంఘనలు జరగ్గా, అందులో 48 వాణిజ్య సముదాయాలను వివిధ కాలాల్లో మూసివేయడం జరిగింది. మూసివేయబడిన వాటిలో బాగా ప్రసిద్ధి పొందిన ముఖ్య కార్ల పంపిణీధారులు సైతం ఉండటం గమనార్హం.వినియోగదారుల పరిరక్షణ శాఖ నివేదిక మేరకు ఈ కార్ల పంపిణీదారులు పాత కార్ల విడి భాగాలను మరమ్మతులు చేసి , వాటికి రంగులు పులిమి కొత్త కార్లగా బ్రమింప చేసి అమ్మకాలను జరిపినట్లు పరిశీలనలో తేలింది. వీరు ఈ తరహ కార్ల అమ్మకాలలోని అసలు నిజం అటు ప్రభుత్వానికి గాని, ఇటు వినియోగదారునికి గాని తెలియచెప్పలేదు. వీరి వ్యాపారంలో ఒక మోసపూరితమైన విధానంను భీతి లేకుండా కొనసాగిస్తున్నట్లు వినియోగదారుల పరిరక్షణ శాఖ పరిగణించింది. వినియోగదారులకు నష్ట నివారణ చర్యలు చేపట్టమని తాము ఆయా కార్ల పంపిణీధారులను కోరగా, వీరిలో అత్యధికులు తాము ఇచ్చిన సూచనను మనస్పూర్తిగా అంగీకరించలేదన్నారు.ఆ విధంగా చేస్తే , తాము కార్ల వినియోగదారుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతామని చెప్పి వారు అందుకు అంగీకనించ లేదు. దీనితో ఖతర్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో కార్ల పంపిణీధారుల కపటం కట్టడి కాబడింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









