ఐసిసిలో ఎంఇఎస్‌ విద్యార్థుల ప్రదర్శన

- June 22, 2019 , by Maagulf
ఐసిసిలో ఎంఇఎస్‌ విద్యార్థుల ప్రదర్శన

ఖతార్‌: ఎంఈఎస్‌ ఇండియన్‌ స్కూల్స్‌కి చెందిన యంగ్‌ స్టూడెంట్స్‌ ఇండియన్‌ కల్చరల్‌ సెంటర్‌ (ఐసిసి) అశోకా హాల్‌లో ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకుల్ని కట్టిపడేశాయి. 85 మంది స్టూడెంట్స్‌ 'గ్లింప్సెస్‌ ఆఫ్‌ ఇండియా' కాన్సెప్ట్‌తో ఫ్యుషన్‌ ఒప్పనా, ఫ్యుషన్‌ థీమాటిక్‌ డాన్స్‌ మరియు గ్రూప్‌ సాంగ్‌ ప్రదర్శనలు చేశారు. భరతనాట్యం డాన్స్‌ సీక్వెన్స్‌ని అవార్డ్‌ విన్నింగ్‌ ఆర్టిస్ట్‌ కుమారి సింధు పి నాయర్‌ ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఇండియన్‌ కల్చరల్‌ సెంటర్‌ మేనేజింగ్‌ కమిటీ మెంబర్స్‌ ఈ బహుమతుల్ని అందజేశారు. ఐసిసి జాయింట్‌ సెక్రెటరీ అంజాన్‌ గంగూలీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com