52 ఫిలిగ్రిమ్స్తో వెళుతున్న బస్సుకి ప్రమాదం
- July 16, 2019
యూఏఈ: 52 మంది యాత్రీకులతో వెళుతున్న బస్సు యూఏఈలో ప్రమాదానికి గురయ్యింది. పవిత్ర మక్కాలో ఉమ్రా ప్రార్థనల కోసం యాత్రీకులు వెళుతున్నారు. ఒమన్కి చెందిన ప్రయాణీకులు ఈ బస్సులో వున్నట్లు తెలుస్తోంది. యూఏఈ హైవేపై మెటల్ బ్యారియర్ని ఈ బస్సు ఢీకొంది. అబుదాబీలోని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగిందనీ, అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. అబుదాబీ ట్రాఫిక్ పోలీస్ - డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ఆఫ్ ఔటర్ రీజియన్ డైరెక్టర్ మాట్లాడుతూ, సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఫిలిగ్రిమ్స్కి బస ఏర్పాట్లు చేశామనీ, ప్రత్యామ్నాయ ట్రాన్స్పోర్టేషన్ వారికి ఏర్పాటయ్యేవరకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించడం, స్పీడ్ లిమిట్స్కి లోబడి బస్సులు నడపడం ద్వారా ప్రమాదాలు నియంత్రించవచ్చునని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..