మస్కట్ హోటల్లో అగ్ని ప్రమాదం: నలుగురికి గాయాలు
- July 22, 2019
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా నలుగురికి గాయాలయ్యాయి. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, గాయాలపాలైనవారిలో కొందరికి తీవ్రగాయాలు అయ్యాయని, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయనీ తెలుస్తోంది. మస్కట్ గవర్నరేట్లోని విలాయత్ బౌషర్లోగల ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగిందనీ, సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, మంటల్ని అదుపు చేయడం జరిగిందనీ, అందులో చిక్కుకుపోయినవారిని రక్షించామని అధికారులు తెలిపారు. గాయపడ్డవారికి అత్యవసర వైద్య చికిత్స అందించి, అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగిందని అధికారులు వివరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!