కేరళ వరదలు: ఒమన్ పౌరులకు హెచ్చరిక
- August 10, 2019
మస్కట్: ఇండియాలోని ఒమన్ ఎంబసీ, తమ పౌరులకు కేరళ వరదల విషయమై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో వరద ప్రమాద తీవ్రత ఎక్కువగా వున్నందున, ఆ రాష్ట్రానికి వెళ్ళినవారు అప్రమత్తంగా వుండాలనీ, వెళ్ళాలనుకునేవారే తమ ప్రయాణాల్ని వాయిదా వేసుకోవడం మంచిదని హెచ్చరించారు అధికారులు. ప్రమాదక పరిస్థితుల్లో ఎవరైనా చిక్కుకుపోయి వుంటే, ఢిల్లీలోని సుల్తానేట్ ఎంబసీని ఫోన్ ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు. ముంబైలోని ఎంబసీ కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చునని అధికారులు తమ పౌరులకు తెలిపారు. కాగా, కోచి ఎయిర్ పోర్ట్ వరదల కారణంగా మూసివేయడంతో అక్కడికి టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







