పేలిన ఆయిల్ ట్యాంకర్.. 62 మంది మృతి..
- August 10, 2019టాంజానియా :ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది.. గుంపులుగా వచ్చి ఆయిల్ పట్టుకొని వెళ్తున్నారు.. ట్యాంకర్ బోల్తా పడిందంటేనే జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో ఓ వ్యక్తి చేసిన తప్పిదం 62 మంది ప్రాణాలు తీసింది.. ఈ ఘోర ప్రమాదం టాంజానియాలో జరిగింది. టాంజానియా రాజధాని దార్ ఎస్ సలామ్కు పశ్చిమంగా వున్న మొరగొరోలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది.. ఇక ప్రమాదానికి గురైన ట్యాంకర్ నుంచి స్థానికులు పెట్రోల్ తీసుకెళ్లేందుకు చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి సిగరెట్ ముట్టించడంతో.. 62 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరో 70 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.. ఈ ఘటనలో 62 మంది మృతిచెందినట్టు నిర్ధారించారు పోలీసులు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు