విశాఖ హార్బర్లో అగ్నిప్రమాదం
- August 12, 2019విశాఖ:విశాఖ ఔటర్ హార్బర్లోని టగ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 70శాతం వరకు ఆ టగ్ తగలబడింది. నౌకలో సివిల్ పనుల కోసం సిబ్బందిని తరలిస్తుండగా టగ్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురై సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. వారి ఆర్తనాదాలు గమనించిన కోస్ట్గార్డు సిబ్బంది అప్రమత్తమై వారిని ఓడ్డుకు చేర్చారు. ప్రమాదం సమయంలో టగ్లో 29 మంది సిబ్బంది ఉండగా.. 28 మందిని రక్షించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన టగ్ను జాగ్వార్గా గుర్తించారు. చమురు నౌకల్ని బెర్త్ వద్దకు తీసుకురావడం, నౌకలో సిబ్బంది సేవల కోసం ప్రభుత్వ రంగ సంస్థ హెచ్పీసీఎల్ ఈ టగ్ను అద్దెకు తీసుకున్నట్టు సమాచారం.
ఏడుగురి పరిస్థితి విషమం...
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఏసీపీ కులశేఖర్ వెల్లడించారు. మిగతా ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు. హెచ్పీసీఎల్కు చమురు పైపు అనుసంధానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు ఏసీపీ తెలిపారు. సహాయక చర్యల్లో రాణి రోష్మణి, చార్లి సీ432 నౌకలు పాల్గొన్నాయని కోస్టు గార్డు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్