పాకిస్థాన్ కు కానీ, చైనాకు కానీ మేము సపోర్ట్ చేయలేదు: బ్రిటన్
- August 21, 2019
బ్రిటన్: జమ్ముకశ్మీర్ అంశంపై గత శుక్రవారం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి రహస్య సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. చైనా కోరిక మేరకు ఈ సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశంలో పాకిస్థాన్ కు అనుకూలంగా బ్రిటన్ వ్యవహరించిందనే వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా బ్రిటన్ ఈ అంశంపై స్పందించింది. భద్రతామండలి సమావేశంలో పాకిస్థాన్ కు కానీ, చైనాకు గాని మద్దతుగా తాము వ్యవహరించలేదని బ్రిటన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
యూకే సీనియర్ దౌత్యవేత్త ఒకరు మాట్లాడుతూ, 'భద్రతామండలి రహస్య సమావేశంలో పాక్, చైనాకకు మద్దతుగా. భారత్ కు వ్యతిరేకంగా మేము వ్యవహరించలేదు. కశ్మీర్ అంశాన్ని ఇండియాపాకిస్థాన్ లే పరిష్కరించుకోవాలనేది తాము ఎప్పుడో తీసుకున్న నిర్ణయం. సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చైనా కోరింది. ఇందులో మా పాత్ర ఏమీ లేదు.
ఆర్టికల్ 370ని రద్దు చేయాలని భారత్ ఏకపక్షంగా నిర్ణయాన్ని తీసుకుందనే విషయాన్ని చైనా చెప్పాలనుకుంది' అని తెలిపారు. సమావేశం తర్వాత ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని చెప్పారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని. కేవలం చర్చ మాత్రమే జరిగిందని అన్నారు. భారత్ కు వ్యతిరేకంగా తాము వ్యవహరించామనే వార్తలు అవాస్తవమని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..