పంజాబ్ ను టార్గెట్ చేసిన పాక్
- August 26, 2019ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్తాన్ నిత్యం ఏదో ఒక రూపంలో ఇండియాకు ఇబ్బందులు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నది. దానివలన ఎలాంటి ఫలితం ఉండదని తెలిసినప్పటికీ.. పాక్ మాత్రం తన బుద్దిని మార్చుకోలేదు. బోర్డర్ లో కాల్పుల విరమణకు స్వస్తిపలికి ఇండియాపై దాడులకు పాల్పడుతూనే ఉన్నది. తాజాగా మరోసారి ఇండియా దాడులకు పాల్పడింది. అయితే, ఈసారి రూటు మార్చింది.
పాకిస్తాన్ తన దేశంలో ఉన్న సట్లెజ్ నది గేట్లను ఎలాంటి హెచ్చరికలు చేయకుండా ఎత్తేసింది. సడెన్ గా ఇలా పాకిస్తాన్ ఆ నది గేట్లు ఎత్తివేయడంతో ఇండియాలోని పంజాబ్ ను వరదలు ముంచెత్తాయి. ఫిరోజ్ పూర్ లోని పలు గ్రామాలు ఈ వరద నీటిలో చిక్కుకున్నాయి. అంతేకాదు.. తెండివాలా గ్రామం వద్ద ఉన్న కరకట్ట దెబ్బతింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యి దెబ్బతిన్న కరకట్టకు మామ్మత్తులు చేస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి పాక్ చేసిన పనిపై మండిపడుతున్నారు. హెచ్చరికలు లేకుండా పాక్ చేసిన పనిని అయన దుయ్యబట్టారు. గతంలోనూ పాక్ ఇలానే చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా