యూ.ఏ.ఈ లో తెలంగాణ వాసి ఆత్మహత్య
- August 29, 2019
యూఏఈ:అల్ అయిన్ లో నిజామాబాదు జిల్లా వాసి రామసరం హరీష్, NCTH కంపెనీ లో క్లీనర్ గా పనిచేస్తున్నాడు,ఇతడు యూఏఈ వచ్చి నాలుగు నెలలు అవుతుంది, డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకొని మరణించాడు.ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు స్థానిక శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకువెళ్లడం తో దుబాయ్ లో ఉన్న ఏముల రమేష్ (అధ్యక్షులు -ప్రవాస హక్కులు) మరియు సంక్షేమ వేదిక -దుబాయ్ సభ్యులతో మాట్లాడి తొందరగా మృతదేహాన్ని ఇండియా పంపడానికి ఏర్పాట్లు చేయమని కోరారు.రమేష్ కంపెనీ ప్రతినిధులతో మరియు ఇండియన్ కాన్సులెట్ అధికారులతో ,తెలంగాణ NRI సెల్ అధికారులతో సంప్రదించడంతో అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేయడంతో ,ఈరోజు మృతదేహాన్ని ఎయిర్ ఇతిహాద్ ఫ్లైట్ లో ఇండియాకు బయలుదేరుతుంది.రేపు ఉదయం వరకు ఇంటికి చేరుతుంది,ప్రతి రోజు ఈవిషయం పైన ఇండియా నుండి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నర్సింహం నాయుడు సలహాలు ఇస్తూ మృతదేహం తొందరగా రావడానికి సహకరించారు.అట్లాగే దీనికి ఆ కంపెనీ HR ఆఫీసర్ అజిత మరియు మృతుడి బంధువు ఒడ్డెన్న,అజయ్ తెడ్డు(ఉపాధ్యక్షులు -ప్రవాస హక్కులు మరియు సంక్షేమ వేదిక -దుబాయ్),బండి జగన్(ప్రధాన కార్యదర్శి),అరుణ్ కుమార్ సురునిదా(వర్కింగ్ ప్రెసిడెంట్),మహిపాల్ తలారి కార్యవర్గ సభ్యులు ,జనగామ శ్రీనివాస్(అడ్వైసర్),తెలంగాణ NRI డిపార్ట్మెంట్ ఆఫీసర్ చిట్టి బాబు తదితరులు సహకరించారు.
తాజా వార్తలు
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!







