యూ.ఏ.ఈ లో తెలంగాణ వాసి ఆత్మహత్య
- August 29, 2019
యూఏఈ:అల్ అయిన్ లో నిజామాబాదు జిల్లా వాసి రామసరం హరీష్, NCTH కంపెనీ లో క్లీనర్ గా పనిచేస్తున్నాడు,ఇతడు యూఏఈ వచ్చి నాలుగు నెలలు అవుతుంది, డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకొని మరణించాడు.ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు స్థానిక శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకువెళ్లడం తో దుబాయ్ లో ఉన్న ఏముల రమేష్ (అధ్యక్షులు -ప్రవాస హక్కులు) మరియు సంక్షేమ వేదిక -దుబాయ్ సభ్యులతో మాట్లాడి తొందరగా మృతదేహాన్ని ఇండియా పంపడానికి ఏర్పాట్లు చేయమని కోరారు.రమేష్ కంపెనీ ప్రతినిధులతో మరియు ఇండియన్ కాన్సులెట్ అధికారులతో ,తెలంగాణ NRI సెల్ అధికారులతో సంప్రదించడంతో అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేయడంతో ,ఈరోజు మృతదేహాన్ని ఎయిర్ ఇతిహాద్ ఫ్లైట్ లో ఇండియాకు బయలుదేరుతుంది.రేపు ఉదయం వరకు ఇంటికి చేరుతుంది,ప్రతి రోజు ఈవిషయం పైన ఇండియా నుండి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నర్సింహం నాయుడు సలహాలు ఇస్తూ మృతదేహం తొందరగా రావడానికి సహకరించారు.అట్లాగే దీనికి ఆ కంపెనీ HR ఆఫీసర్ అజిత మరియు మృతుడి బంధువు ఒడ్డెన్న,అజయ్ తెడ్డు(ఉపాధ్యక్షులు -ప్రవాస హక్కులు మరియు సంక్షేమ వేదిక -దుబాయ్),బండి జగన్(ప్రధాన కార్యదర్శి),అరుణ్ కుమార్ సురునిదా(వర్కింగ్ ప్రెసిడెంట్),మహిపాల్ తలారి కార్యవర్గ సభ్యులు ,జనగామ శ్రీనివాస్(అడ్వైసర్),తెలంగాణ NRI డిపార్ట్మెంట్ ఆఫీసర్ చిట్టి బాబు తదితరులు సహకరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







