హైదరాబాద్ లో కేజీఎఫ్ 2
- September 05, 2019కేజీఎఫ్..ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. కన్నడ చిత్రమైనప్పటికీ అన్ని భాషల్లో డబ్ అయి రికార్డ్స్ బ్రేక్ చేసింది. అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా యష్ హీరోగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2ని భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా కోలార్ ఫీల్డ్స్లోని సైనైడ్ హిల్స్లో షూటింగ్ జరుపుతుండగా అక్కడి పర్యావరణానికి హాని కలుగుతుందంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం కూడా ఈయన పిటిషన్ గురించి ఆలోచించి షూటింగ్ను ఆపాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశం తో ఈ సినిమా షూటింగ్ ను హైదరాబాద్, బెంగుళూర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ సెట్లలో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?