ప్రధాని పుట్టినరోజు శోభ
- September 17, 2019సెప్టెంబర్ 17వ తేదీ తన 69వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు వెళ్లారు. సర్దార్ సరోవర్ డ్యాం వద్ద ఉన్న నర్మద దేవతకు చేసిన పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న నమామీ దేవీ నర్మదె మహోత్సవాల్లో భాగంగా గుజరాత్ ముఖ్య మంత్రి విజయ రూపాణీతో కలిసి మోడీ పాల్గొన్నారు.
ఆ తర్వాత కెవాడియాలో ఉన్న బటర్ ఫ్లై గార్డెన్కు వెళ్లారు. అక్కడ కాషాయ రంగులో ఉన్న సీతాకోకచిలుకను రాష్ట్ర సీతాకోక చిలుకగా ప్రకటించారు. పర్యటనలో భాగంగా ముందు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారు. 138.68మీటర్ల ఎత్తులో ఉన్న రిజర్వాయర్కు నిండుగా నీళ్లు రావడంతో అక్కడ జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొన్నారు.
2017 తర్వాత నీటి స్థాయి పెంచాక రిజర్వాయర్ నిండుకోవడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రితో కలిసి నర్మదా నీటికి స్వాగతం తెలిపారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీని ఓ టూరిజం స్పాట్గా తీర్చి దిద్దాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించారు. పర్యాటకులకు కనువిందు చేసేందుకు బోట్ ప్రయాణం, బటర్ ఫ్లై పార్క్, ఏక్తా నర్సరీలు ఏర్పాటుచేశారు. ఆ తర్వాత నర్మదా ఒడ్డున ఉన్న గరుడేశ్వర్ గ్రామంలోని దత్త్ మందిర్ను సందర్శించారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?