అనైతిక చర్యలు: 27 మంది ఆసియా నిర్వాసితులను అరెస్టు
- October 09, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ఓపి) కమాండ్, 27 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇందులో అత్యధికులు మహిళలే. పబ్లిక్ మొరాలిటీని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారంటూ వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. 'మస్కట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ 21 మంది మహిళల్ని, 6 మంది పురుషుల్నీ అరెస్ట్ చేయడం జరిగింది. వీరంతా ఆసియా జాతీయులు. పబ్లిక్ మొరాలిటీస్ని దెబ్బతీయడమే కాకుండా లేబర్ మరియు రెసిడెన్సీ ఉల్లంఘనలకు కూడా వీరు పాల్పడ్డారు..' అంటూ రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. రెంటెడ్ అపార్ట్మెంట్ల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..