మజ్జిగ తో అట్టు ట్రై చేసారా!
- October 13, 2019
మజ్జిగను మనం అన్నంలో వేసుకొని తింటారు. లేదా తాగుతారు. ఒట్టి మజ్జిగను మాత్రమే తాగకుండా అందులో కొచం రుచిని పెంచడానికి మసాలా వేసి చేసుకొని తాగుతారు. ఇకపోతే ఈ మజ్జిగతో వెరైటీగా స్నాక్స్ కూడ చేసుకోవచ్చును. అలాంటిది ఈ మజ్జిగను ఉపయోగించి అట్టు వేసుకోవచ్చును అంటున్నారు అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
బియ్యపు పిండి : అరకప్పు
మైదా పిండి : అరకప్పు
పెరుగు : మూడు స్పూన్లు
పచ్చిమిర్చి : ఐదు
ఉల్లిపాయ :ఒకటి
వాటర్ : 2కప్స్
జీలకర్ర : కొద్దిగా
ఉప్పు : సరిపడా
తయారీ విధానం :
బియ్యపు పిండి, మైదా పిండి సమంగా తీసుకొని, పెరుగులో కొన్ని నీళ్లు వేసి మజ్జిగగా తయారు చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి, జీలకర్ర ను నూరి పక్కన పెట్టాలి. ఈ మజిగ్గలో, ఆ పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి పిండి మిశ్రమంలో వేసి దోస పిండిలాగా కలుపుకోవాలి. అలా కలిపిన పిండిని కొద్దీ సేపు నానపెట్టాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసి అట్టులాగా వేసుకొని రెండు వైపులాగా దోరగా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన మజ్జిగ అట్టు రెడీ..
తాజా వార్తలు
- రేపు కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ సభ
- ఒమాన్లో 2028 నుండి 5% వ్యక్తిగత ఆదాయ పన్ను
- ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్..
- రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలకు తెరదించిన సౌరవ్ గంగూలీ
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: స్థిరంగా యూఏఈ ఎయిర్ ట్రాఫిక్..సౌదీలో రెట్టింపు..!!
- సంక్షోభంలో మానవత్వం..ఇరాన్పై అమెరికా దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు..!!
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. 3 అణు కేంద్రాలపై దాడులు..!!
- విలాయత్ బర్కాలో అగ్నిప్రమాదం..సీడీఏఏ
- ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్లు హ్యాక్.. ఐటీ భద్రతను పెంచాలన్న కంపెనీలు..!!
- ఇరాన్పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా