దుబాయ్ లో దైవసేవకురాలు (నర్సాపురం వాసి ) హఠాన్మరణం
- October 20, 2019దుబాయ్ లో ఒక ప్రైవేట్ కార్యక్రమం లో పాల్గొనేందుకు వచ్చిన ఒక మహిళా దైవసేవకురాలు గుండెపోటు తో హఠాన్మరణం చెందిన సంఘటన ఇటీవల జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం యలమంచిలి కి చెందిన మధుర సత్యావతి శుక్రవారం తన భర్త వినయ భూషణం తో కలిసి విజిట్ వీసా లో దుబాయ్ కి వచ్చారు. మంగళవారం ఆకస్మికంగా గుండెనొప్పి రావడంతో వెంటనే హుటాహుటిన ప్రభుత్వ దుబాయ్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె మార్గమధ్యంలో మృతి చెందారని డాక్టర్లు ధృవీకరించారు. అయితే సాధారణంగా మృతదేహాన్ని ఇండియా కి తరలించడం చాల క్లిష్టమైన ప్రక్రియ. దుబాయ్ చట్టాల ప్రకారం అనేక లాంఛనాలు ఉంటాయి. అయితే ఇక్కడి తెలుగు న్యాయవాది షాలేంబాబు చొరవతీసుకుని చాకచక్యంగా అన్ని లాంఛనాలు త్వరితగతిన కేవలం రెండు రోజుల్లోనే పూర్తిచేయడంతో ఆమె పార్ధివదేహాన్ని విమానంలో ఇండియా కి తరలించారు.
మధుర సత్యావతి దైవ సేవకురాలిగాను ఆమె భర్త పాస్టర్ గా పశ్చిమ గోదావరి జిల్లాలో సేవ చేస్తున్నారు.ఆమె మృతికి దుబాయ్ లోని తెలుగు క్రిస్టియన్ సంఘాలు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు