హాంకాంగ్ లో రెచ్చిపోయిన నిరసనకారులు
- October 21, 2019
అల్లర్లతో హాంకాంగ్ మళ్ళీ ఉద్రిక్తమైంది. ప్రజాస్వామ్య అనుకూలవాదులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఆదివారం వీధుల్లో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేయడమే కాకుండా.. బస్సులు, ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. చైనాకు చెందిన వ్యాపార సముదాయాలపైనా దాడులకు పాల్పడుతూ.. ఒక సమయంలో రెచ్చి పోయి.. పోలీసులపై పెట్రోలు బాంబులు విసిరారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో సుమారు 24 మంది గాయపడ్డారు. వీరిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. హాంకాంగ్ లో పోలీసుల దమనకాండను అణచివేయాలని, రాజకీయ హక్కులను పునరుధ్దరించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.. కాగా ఆ మధ్య నేరస్థుల అప్పగింత బిల్లుకు నిరసనగా సుమారు నాలుగు నెలల పాటు హాంకాంగ్ వీరి ఆందోళను, ఉద్యమాలతో హోరెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కొంత తేరుకొంటున్న పరిస్థితులు ఏర్పడుతుండగా తిరిగి ఈ నగరం హింసతో ' కాక ' రేగుతోంది. చైనా జెండాలను నాజీ స్వస్తిక్ గుర్తుతో పోలుస్తూ ఆ దేశానికి వ్యతిరేకంగా ఉద్యమకారులు మళ్ళీ చెలరేగడంతో పాలకవర్గం తలలు పట్టుకుంటోంది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







