భారత వలస కార్మికుల మృతి: ఎక్స్‌గ్రేషియా ప్రకటన

- November 13, 2019 , by Maagulf
భారత వలస కార్మికుల మృతి: ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మస్కట్‌: సీబ్‌లోని ఓ కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో చోటు చేసుకున్న ప్రమాదం ఆరుగురు కార్మికుల్ని బలికొనగా, మృతుల్ని గుర్తించారు. మృతులంతా భారత వలసదారులే. ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌ మరియు తమిళాడుకి చెందిన కార్మికులు మృతి చెందినట్లు గుర్తించారు అధికారులు. మృతుల వయస్సు 22 నుంచి 43 ఏళ్ళ మధ్య వుంటుందని అధికారులు తెలిపారు. ఘటన అత్యంత బాధాకరమనీ, రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ నుంచి వచ్చే నివేదిక కోసం ఎదురుచూస్తున్నామనీ, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు సిద్ధంగా వున్నామని కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పేర్కొంది. మరోపక్క, మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిది. భద్రతా చర్యల పరంగా లోపాలు వుంటే సహించేది లేదని హెచ్చరించింది. మృతదేహాన్ని ఫార్మాలిటీస్‌ పూర్తయ్యాక స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com