'కోడీశ్వరి' క్విజ్ షోకు రాధిక హోస్ట్
- November 13, 2019కౌన్ బనేగా కరోడ్పతి.. ఈ షో గుర్తింది కదా..! బాలీవుడ్లో.. అమితాబ్ హోస్ట్గా వ్యవహరించిన ఈ షో.. ఇండియాలోనే బిగ్గెస్ట్ రేటింగ్తో దూసుకెళ్లింది. ఇది బాగా పాపులర్ అవడంతో.. అనంతరం ఈ షోను వివిధ భాషల్లోనూ తీసుకొచ్చారు. తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఈ షోకి వ్యాఖ్యతలుగా వ్యవహరించగా.. తమిళంలో 'నీంగలుమ్ వెల్లాలుమ్' ఒరు కోడి' పేరుతో.. సూర్య, ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామిలు ఒక్కో సీజన్లో హోస్టులుగా వ్యవహరించారు.
కాగా.. ఇప్పుడు ఈ షోకు.. సినీనటి రాధికకు లింక్ ఏంటని అనుకుంటున్నారా..? అసమాన నటిగా పేరు తెచ్చుకున్న రాధిక ఈషోకు హోస్ట్గా వ్యవహరించబోతున్నారు. కోటీశ్వరుడు మాదిరిగా.. తమిళంలో 'కోడీశ్వరి' అనే గేమ్ షోను ప్లాన్ చేశారు. ఈ క్విజ్ షోకు రాధిక హోస్ట్గా వ్యవహరిస్తుండగా.. ఇందులో కేవలం మహిళలు మాత్రమే పార్టిసిపేట్ చేయనున్నారు. పలు టీవీ సీరియల్స్లో నటించిన రాధికా తొలిసారి హోస్ట్గా దర్శనమివ్వనున్నారు. కలర్స్లో టీవీ ఛానెల్లో ఈ షో ప్రసారం కానుంది. డిసెంబర్లో ఈ షో ప్రారంభం కానున్నట్టు సమాచారం. అయితే.. ఈ షో టైమింగ్స్ ఇంకా డిసైడ్ చేయలేదు.
ఈ సందర్భంగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. రాధికకు ఓ వీడియో రికార్డ్ చేసి పంపారు. ఆ వీడియోలో.. మొదటిసారిగా.. ఈ షోకు ఓ లెడీ సూపర్ స్టార్ హోస్ట్గా వ్యవహరించడం.. కేబీసీ చరిత్రలో సువర్ణ అధ్యాయం.. అందులోనూ.. ఓన్లీ ఫీమేల్స్ కోసమే ఈ షో ఉండటం గమనించదగ్గ విషయం. మీ కెరీర్లో ఎంత ఉన్నత స్థానం సంపాదించారో.. ఇందులో కూడా మంచి పేరు సాధించాలని కోరుకుంటూ.. రాధికకు ఆల్దిబెస్ట్ చెప్పారు అమితాబ్.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?