అమితాబ్కు నోటీసులు పంపిన తెలుగు దర్శకుడు
- November 19, 2019బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ అప్ కమింగ్ మూవీ 'జుంద్' కాపీ రైట్ చిక్కుల్లో పడింది. హైదరాబాద్కు చెందిన షార్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్ నంది చిన్నికుమార్ ఆ చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించారు. గత అక్టోబర్ మొదటి వారంలో అమితాబ్తో పాటు దర్శకుడు నాగరాజ్ మంజులే, నిర్మాత కృష్ణ కుమార్, భూషణ్ కుమార్, 'స్లమ్ సాకర్' ఎన్జీవో స్థాపకులు అఖిలేశ్ పౌల్, విజయ్ బర్సేలకు నోటీసులు పంపిచారు.
స్లమ్ సాకర్ ఉద్యమానికి ఊపిరి పోసిన నాగ్పూర్కు చెందిన రిటైర్డ్ స్పోర్ట్స్ టీచర్ విజయ్ బర్సే, 'హోమ్లెస్ వరల్డ్ కప్'లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించిన అఖిలేశ్ పౌల్ జీవిత కథ ఆధారంగా 'జుంద్' సినిమా తీస్తున్నారు. ఇందులో విజయ్ బర్సే పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. అయితే ఈ కథనే తాను 'స్లమ్ సాకర్' అనే పేరుతో సినిమాగా తీద్దామనుకున్నానని నోటీసుల్లో చిన్ని కుమార్ పేర్కొన్నారు. 2017లో పౌల్ నుంచి అనుమతి కూడా తీసుకున్నానని, 'లైఫ్ స్టోరీ రైట్స్ అగ్రీమెంట్'పై సంతకం కూడా చేశారని చిన్ని కుమార్ చెప్పారు. ఏ భాషలోనైనా సినిమా తీసేందుకు సర్వహక్కులు తనకు ఇచ్చారని తెలిపారు. జుంద్ ప్రొడ్యూసర్కు తాను ఎన్నిసార్లు మెయిల్స్ పంపినా సమాధానం రాలేదని, పైపెచ్చు తనను బెదిరింపులకు గురి చేశారని నోటీసుల్లో చిన్ని కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు