అమెరికా లో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం
- December 02, 2019
డిసెంబర్ 1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరిని విజయవాడకు చెందిన వైభవ్ గోపిశెట్టిగా గుర్తించారు. టేనస్సీ స్టేట్ యూనివర్సిటీలో వైభవ్ ఫుడ్ సైన్స్ లో పీహెచ్ డీ చేస్తున్నారు. అక్కడే ఎంఎస్ చేస్తున్న జుడీ స్టాన్లీ పిని రియోతో కలిసి రాత్రి ఓ పార్టీకి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొట్టింది.ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ కు డ్రైవర్, డేవిడ్ స్టోరేజ్ వాహనం అక్కడే వదిలి పరారైనట్టు పోలీసులు పేర్కొన్నారు.
తమ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందడం పట్ల టీఎస్ యూ సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ఘటన దురదృష్టకరమని అట్లాంటాలోని భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది అని అధికారులు తెలియజేశారు. భారత ఎంబస్సి వారిని సంప్రదించి ఆ ఇద్దరి మృతదేహాలను వారి ఇంటికి చేరేలా చెయ్యాలని బంధువులు ప్రభుత్వాన్ని కోరారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..