బహ్రెయినైజేషన్‌: 300 మంది వలసదారులకు 'నో' రెన్యువల్‌!

- December 11, 2019 , by Maagulf
బహ్రెయినైజేషన్‌: 300 మంది వలసదారులకు 'నో' రెన్యువల్‌!

బహ్రెయిన్‌: బహ్రెయినైజేషన్‌లో భాగంగా 300 మంది వలసదారులకు రెన్యువల్‌ చేసేందుకు 'నో' చెప్పనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న ఈ వలసదారుల స్థానంలో బహ్రెయినీలకు అవకాశం కల్పిస్తామని సివిల్‌ సర్వీస్‌ బ్యూరో అధికారి పేర్కొన్నారు. మొత్తం 7206 మంది విదేశీయులు వివిధ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారనీ, ఈ సంఖ్య గత ఏడాది 7582గా వుందని ఆయన వివరించారు. కాగా, నేషనల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో పౌరులు తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకునేందుకుఉ వీలుగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. నాలుగేళ్ళలో పూర్తి స్థాయిలో బహ్రెయినైజేషన్‌ జరిగేలా ఓ ప్రపోజల్‌కి పార్లమెంటు మెంబర్స్‌ ఇప్పటికే ఆమోదం తెలపడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com