ఇండియన్ పాస్పోర్ట్లో కొత్త మార్పులు
- December 13, 2019ఢిల్లీ: రెండు రోజులుగా పాస్పోర్ట్ వ్యవహారం చర్చనీయాంశమమైంది. కేరళలోని కోజికోడ్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న పాస్పోర్ట్ పుస్తకాల్లో కమలం చిహ్నం ముద్రించినట్లు ఆరోపణలు రావడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయమై లోక్సభలో కాంగ్రెస్ సభ్యుడొకరు లేవనెత్తడంతో కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. నకిలీ పాస్పోర్ట్లను గుర్తించడం, భద్రతా ప్రమాణాల పెంపుదలలో భాగంగానే కొత్త పాస్పోర్ట్ పుస్తకాలపై కమలం చిహ్నాన్ని ముద్రించామని తెలిపింది. ఒక్క చిహ్నాలే కాదు కొత్త పాస్పోర్ట్ల్లో మరిన్ని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి.
గతంలో పాస్పోర్ట్ రెండో పేజీలో పాస్పోర్ట్ అధికారి సంతకం ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలో కమలం గుర్తు ఉండనుంది. వంతులవారీగా ఇతర జాతీయ చిహ్నాలను ఆ స్థానంలో ముద్రించనున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్కుమార్ తెలిపారు. పాత పాస్పోర్ట్లో వ్యక్తిపేరు, చిరునామా, ఇతర వివరాల కోసం వేర్వేరు కాలమ్లు ఉండేవి. కొత్త పాస్పోర్ట్లో వేర్వేరుగా కాలమ్స్ ఉండబోవు. పాస్పోర్ట్ కోడ్లలో కూడా మార్పులు చేశారు.
పాస్పోర్ట్ నాణ్యతనూ పెంచుతున్నారు. నాణ్యమైన కాగితాన్ని, మంచి ప్రింటింగ్ టెక్నాలజీని ముద్రణలో ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్లో ముద్రణ ప్రక్రియ చేపడుతున్నారు. కొత్త ఫీచర్లతో వస్తున్న పాస్పోర్ట్లకు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) ఆమోద ముద్ర వేసింది. మరోవైపు మరిన్ని భద్రతా ప్రమాణాలతో ఈ-పాస్పోర్ట్లను కూడా తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ సన్నద్ధమవుతోంది.
తాజా వార్తలు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..