అబుదాబి: లండన్ లో మృతి చెందిన ఒమని యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన యువరాజు
- December 14, 2019లండన్ లో దోపిడి దొంగల దాడితో మృతి చెందిన ఒమని కుటుంబాన్ని అబుదాబి యువరాజు షేమ్ మొహమ్మద్ బిన్ జయాద్ పరామర్శించారు. మస్కట్ లో నివాసముంటున్న వ్యాపారవేత, అల్ రైడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని అబ్ధుల్లా అల్ అరైమి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబానికి సంతాపం ప్రకటించారు. అబ్దుల్లా అల్ అరైమి కుమారుడు మొహమ్మద్ అల్ అరైమీ గత డిసెంబర్ 6న దోపిడి దొంగల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మధ్యరాత్రి వేళ లండన్ లోని నైట్స్ బ్రిడ్జి ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మొహమ్మద్ అల్ అరైమి లండన్ కింగ్స్ కాలేజీలో పాలిటిక్స్ &
ఎకనామిక్స్ చదువుతున్నాడు. భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో స్నేహితుడితో కలిసి నడిచివెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దాడిలో మొహమ్మద్ అల్ అరైమీ మృతి చెందగా..అతని స్నేహితుడికి గాయాలయ్యాయి. అయితే..ఘటనపై విచారణ జరుగుతోందని, పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉందని, దాడికి పాల్పడింది ఎవరో తెల్సుకోవాల్సి ఉందని లండన్ పోలీసులు చెబుతున్నారు.
కుమారుడి మరణంతో విషాదంలో మునిగిపోయిన అబ్దుల్లా అల్ అరైమి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఉప ప్రధాని షేక్ మన్సూర్ బిన్ జాయెద్ కూడా వ్యాపారవేత కుటుంబానికి సంతాపం తెలిపారు. తమ కుటుంబాన్ని పరామర్శించిన యువరాజుకు ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 6న జరిగిన దుర్ఘటన తమ జీవితంలో తేరుకోలేని విషాదాన్ని నింపిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడి మృతి వార్తతో తమ గుండెలు బద్ధలైనంత పని జరిగిందన్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు