మస్కట్:తగ్గనున్న చెక్ ఇన్ లగేజీ ఛార్జీల భారం..వలసదారులకు ఊరట
- December 23, 2019
ఓమన్ నుంచి స్వదేశాలకు వెళ్లే వలసదారులకు ఇక నుంచి లగేజీ ఛార్జీల భారం తగ్గనుంది. మస్కట్ నుంచి ఇండియా, ఇండోనేషియా, ఫిలిపిన్స్, పాకిస్తాన్, శ్రీలంక, ఈజీప్ట్ వెళ్లే వలసదారులు 40 కేజీల వరకు చెక్ ఇన్ లగేజీని ఫ్రీగా తీసుకెళ్లవచ్చు. అయితే..బ్యాగులు మాత్రం రెండు కన్న ఎక్కువ ఉండకూడదని ఓమన్ ఎయిర్ లైన్స్ కండీషన్ పెట్టింది. వచ్చే మార్చి 31లోపు ప్రయాణించే వారికి మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. వలసదారుల దేశాలను బట్టి కూడా టైం పీరియడ్ లో మార్పులు ఉన్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, జైపూర్, గోవా, బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురం, చెన్నైతో పాటు మనీలా, జకార్తా వెళ్లే వారికి జనవరి 10 - మార్చి 31 వరకు 40 కేజీల చెక్ ఇన్ లగేజీని అనుమతిస్తారు. కరాచీ, లాహోర్, కొలంబో, కైరోకి వెళ్లే వారికి మాత్రం ఈ నెల 19 నుంచే ఎక్స్ ట్రా లగేజీ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మార్చి 31 వరకు 40 కేజీల లగేజీని తీసుకెళ్ల అవకాశం ఉంది. ఈ అఫర్ తో స్వదేశాలకు వెళ్లే వలసదారులు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కోసం కానుకలు తీసుకుళ్లే అవకాశం దక్కింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..