హీరా గోల్డ్ నౌహీరా షేక్‌ కేసులన్నీ SFIO కు బదిలీ

- December 25, 2019 , by Maagulf
హీరా గోల్డ్ నౌహీరా షేక్‌ కేసులన్నీ SFIO కు బదిలీ

హైదరాబాద్: సుమారు 1.72 లక్షల మంది పెట్టుబడి దారులను మోసం చేసి సుమారు రూ. 5600 కోట్లను కాజేసిన ఆరోపణపై 2018 అక్టోబర్ 16వ తేదీన తెలంగాణ పోలీసులు 
హీరా గోల్డ్ చీఫ్ నౌహీరా షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నౌహీరా షేక్‌కు తెలంగాణ హైకోర్టు లో చుక్కెదురైంది. నౌహీరా షేక్‌పై ఉన్న కేసులను సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకొంది. తెలంగాణ రాష్ట్రంలో నౌహీరా షేక్‌పై 10 కేసులు ఉన్నాయి. బుధవారం నాడు  హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ  సాయంత్రం నౌహీరా షేక్ చంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది.  కోర్టులో రూ. 5 కోట్లను డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని కూడ హైకోర్టు నౌహీరా షేక్‌ను ఆదేశించింది. కోర్టులో ఆమె పాస్‌పోర్టును సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com