హీరా గోల్డ్ నౌహీరా షేక్ కేసులన్నీ SFIO కు బదిలీ
- December 25, 2019
హైదరాబాద్: సుమారు 1.72 లక్షల మంది పెట్టుబడి దారులను మోసం చేసి సుమారు రూ. 5600 కోట్లను కాజేసిన ఆరోపణపై 2018 అక్టోబర్ 16వ తేదీన తెలంగాణ పోలీసులు
హీరా గోల్డ్ చీఫ్ నౌహీరా షేక్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నౌహీరా షేక్కు తెలంగాణ హైకోర్టు లో చుక్కెదురైంది. నౌహీరా షేక్పై ఉన్న కేసులను సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకొంది. తెలంగాణ రాష్ట్రంలో నౌహీరా షేక్పై 10 కేసులు ఉన్నాయి. బుధవారం నాడు హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ సాయంత్రం నౌహీరా షేక్ చంచల్గూడ జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. కోర్టులో రూ. 5 కోట్లను డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని కూడ హైకోర్టు నౌహీరా షేక్ను ఆదేశించింది. కోర్టులో ఆమె పాస్పోర్టును సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







