హీరా గోల్డ్ నౌహీరా షేక్ కేసులన్నీ SFIO కు బదిలీ
- December 25, 2019
హైదరాబాద్: సుమారు 1.72 లక్షల మంది పెట్టుబడి దారులను మోసం చేసి సుమారు రూ. 5600 కోట్లను కాజేసిన ఆరోపణపై 2018 అక్టోబర్ 16వ తేదీన తెలంగాణ పోలీసులు
హీరా గోల్డ్ చీఫ్ నౌహీరా షేక్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నౌహీరా షేక్కు తెలంగాణ హైకోర్టు లో చుక్కెదురైంది. నౌహీరా షేక్పై ఉన్న కేసులను సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకొంది. తెలంగాణ రాష్ట్రంలో నౌహీరా షేక్పై 10 కేసులు ఉన్నాయి. బుధవారం నాడు హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ సాయంత్రం నౌహీరా షేక్ చంచల్గూడ జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. కోర్టులో రూ. 5 కోట్లను డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని కూడ హైకోర్టు నౌహీరా షేక్ను ఆదేశించింది. కోర్టులో ఆమె పాస్పోర్టును సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







