స్విమ్మింగ్ పూల్ డెత్ ట్రయల్: జిమ్ మేనేజ్మెంట్కి ఊరట
- December 30, 2019
బహ్రెయిన్: ఓ వ్యక్తి స్విమ్మింగ్ పూల్లో మృతి చెందిన ఘటనకు సంబంధించి, ఆ ప్రాంగణాన్ని నిర్వహిస్తోన్న జిమ్ మేనేజ్మెంట్కి ఊరట లభించింది. కింది స్థాయి కోర్టు, ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబానికి 40,000 బహ్రెయినీ దినార్స్ నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించగా, సదరు సంస్థ హై అప్పీల్ కోర్టును ఆశ్రయించి ఊరట పొందింది. కేసు వివరాల్లోకి వెళితే, ఓ వ్యక్తి స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంగణంలో సహాయకులు ఎవరూ లేరనీ, లైఫ్ జాకెట్స్ కూడా అందుబాటులో వుంచలేదనీ, ఈ కారణంగానే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు బాధిత కుటుంబం పేర్కొంది. అయితే, 1.3 మీటర్ల లోతులోనే స్విమ్మింగ్ పూల్ వుందనీ, లైఫ్ జాకెట్లు అవసరంలేదని తన వాదనల్ని విన్పించిన జిమ్ సంస్థ, ఆ స్విమ్మింగ్ పూల్కి రెగ్యులర్గా వచ్చే కస్టమర్ గనుక అతనికి అన్ని విషయాలూ తెలుస్తాయనీ, ఇఫ్తార్ సమయంలో సహాయకులు ఎవరూ వుండరని తెలిసి కూడా స్విమ్మింగ్ పూల్లోకి దిగారని జిమ్ యాజమాన్యం పేర్కొంది. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన జరీమానా చెల్లించాలనే తీర్పుని కొట్టివేసింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..