ఇండియన్‌ సిటిజన్‌షిప్‌ యాక్ట్‌పై బహ్రెయిన్‌ రిప్రెజెంటేటివ్‌ కౌన్సిల్‌ స్పందన

- January 03, 2020 , by Maagulf
ఇండియన్‌ సిటిజన్‌షిప్‌ యాక్ట్‌పై బహ్రెయిన్‌ రిప్రెజెంటేటివ్‌ కౌన్సిల్‌ స్పందన

మనామా:బహ్రెయిన్‌ రిప్రెజెంటేటివ్‌ కౌన్సిల్‌, తమ ఫ్రెండ్లీ నేషన్‌ అయిన ఇండియాలో సిటిజన్‌షిప్‌ యాక్ట్‌ అమలుపై స్పందించింది. అంతర్జాతీయ ప్రమాణాలు, హ్యూమన్‌ రైట్స్‌, సివిలైజేషనల్‌ ప్రాక్టీసెస్‌కి అనుగుణంగా ఇండియా వ్యవహరించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది. ఇండియాలో గత కొద్ది రోజులుగా సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ విషయమై నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఈ విషయమై భారత ప్రభుత్వం పునరాలోచించాలని బహ్రెయిన్‌ విజ్ఞప్తి చేసింది. భారతదేశంలో ముస్లింల అభిప్రాయాల్నీ అక్కడి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని రిప్రెజెంటేటివ్‌ కౌన్సిల్‌ అభిప్రాయపడింది. భారత్‌తో బహ్రెయిన్‌ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుందనీ, ఈ బంధం మరింత బలపడాలని ఆకాంక్షించింది బహ్రెయిన్‌ రిప్రెజెంటేటివ్స్‌ కౌన్సిల్‌.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com