ఒమన్: సుల్తాన్ కబూస్ బిన్ సైద్ అల్ సైద్ వారసుడు ఎవరు?
- January 11, 2020
ఒమన్: అనారోగ్యంతో కన్నుమూసిన సుల్తాన్ కబూస్ బిన్ సైద్ వారసుడు ఎవరు? సుల్తాన్ కబూస్ స్థానంలో ఒమన్ సుల్తాన్ గా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారు.
కొన్నాళ్లు ఒమన్ లో సస్పెన్స్ గా మారిన ఈ ప్రశ్నకు సమాధానం సీల్డ్ కవర్ లో భద్రంగా ఉంది. ఆరోగ్యం విషమించటంతో తన తదుపరి వారసుడి పేరును సుల్తాన్ కబూస్ బిన్ సైద్ ముందుగానే సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారసుడి పేరును సీల్డ్ కవర్ లో రాసి దాచిపెట్టారు. తాను కాలం చేసిన తరువాతే కవర్ ఓపెన్ చేయాలని కండీషన్ కూడా పెట్టారు. దీంతో సీల్డ్ కవర్ లో ఎవరి పేరు ఉందనేది ఉత్కంఠ రేపుతోంది.
సుల్తానేట్ రాజరిక ఆచారాల ప్రకారం సింహాసనం ఖాళీ అయిన మూడు రోజుల్లోనే కొత్త సుల్తాన్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. 50 మంది పురుష సభ్యులు ఉంటే సుల్తానేట్ రాయల్ కౌన్సిల్ కొత్త సుల్తాన్ ను ఎంపిక చేస్తుంది. అయితే..దివంగత సుల్తాన్ కబూస్ బిన్ సైద్ ఇప్పటికే తన వారసుడ్ని డిక్లేర్ చేసి సీల్డ్ కవర్ లో దాచిపెట్టారు. దీంతో రాయల్ కౌన్సిల్ ద్వారా ఎంపిక పద్దతిన కాకుండా సీల్డ్ కవర్ లో ఉన్న పేరు ఉన్న వారికే సుల్తాన్ పదవి దక్కనుంది. దేశ అత్యున్నత పదువుల్లో ఉన్న పలు విభాగాల ప్రముఖుల సమక్షంలో ఈ సీల్డ్ కవర్ ను ఓపెన్ చేస్తారు. డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్స్, సుప్రీం కోర్టు ఛైర్మన్, కన్సల్టేటీవ్ కౌన్సిల్, స్టేట్ కౌన్సిల్ సమక్షంలో కవర్ తెరుస్తారు.
దీంతో తర్వాతి సుల్తాన్ పోటీలో అతని బంధువలుల్లోని ముగ్గురు సోదరుల పేర్లు పోటీలో ఉన్నట్లు..వారి పేర్లలోనే ఒకరిని తన వారసుడిగా సుల్తాన్ కబూస్ బిన్ సైద్ ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సాంస్కృతిక శాఖ మంత్రి హైతం బిన్ తారిక్ అల్ సైద్, ఉప ప్రధాని అసద్ బిన్ తారిక్ అల్ సైద్, ఒమన్ నేవీ మాజీ కమాండర్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే..ఒమన్ సర్వ నిర్ణయాధికారి సుల్తాన్ ఎవరనేది సీల్డ్ కవర్ లో ఓపెన్ చేసిన తర్వాత క్లారిటీ రానుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







