సరిలేరు నీకెవ్వరు సక్సెస్: రష్మిక ఇంట్లో ఐటీ దాడులు
- January 16, 2020టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కన్నడ హీరోయిన్ రష్మిక మందనా ఇప్పుడు క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే అనుకోని షాక్ ఎదురైంది.
ఆమె సొంత రాష్ట్రం కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్పేట శివార్లలో ఉన్న ఇంట్లో గురువారం(16 జనవరి 2020) ఉదయం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు రష్మికకు సంబంధించిన బ్యాంక్, ఆస్తి వివరాలను పరిశీలిస్తున్నారు. రష్మిక సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా.. ప్రస్తుతం ఇంట్లో లేదు.
'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటనకు గాను ఆమెకు ప్రశంసలు అందుతున్న సమయంలోనే ఈ ఐటీ దాడులు జరగడం విశేషం. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు కన్నడలో హీరోయిన్గా దూసుకుపోతుంది. అల్లు అర్జున్ సుకుమార్ సినిమాలో రష్మికకు అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్