అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులవ్వాలి: ప్రిన్స్ ఖలీఫా
- January 18, 2016
ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, ప్రభుత్వం దేశ ఆర్థిక ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందనీ, సమాజంలోని వివిధ విభాగాలు దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అన్నారు. ప్రైవేట్ సెక్టార్ మరియు వ్యాపారవేత్తలు అభివృద్ది పథంలో దేశం నడవడానికి తోడ్పాటునందించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (బిసిసిఐ) సేవల్ని ప్రిన్స్ ఖలీఫా కొనియాడారు. గుడాబియా ప్యాలస్లో రాయల ఫ్యామిలీ మెంబర్స్, సీనియర్ స్టేట్ అఫీషియల్స్, ప్రముఖ వ్యాపారవేత్తలు, మర్చంట్స్, బిసిసిఐ ఛైర్మన్ ఖాలిద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ మోయ్యాద్ నేతృత్వంలో ప్రిన్స్ ఖలీఫాకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేశ ప్రగతి గురించి ప్రిన్స్ ఖలీఫా మాట్లాడారు. పెట్టుబడిదారులకు దేశం స్వర్గధామమనీ, వారికి అవసరమైన మౌళిక సౌకర్యాలు కల్పించడానికి ఎప్పుడూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









