తెలుగు రాష్ట్రాల్లో భూకంపం..
- January 26, 2020
తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి భూకంపం వచ్చింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బసవాపురం, పాతర్లపాడు.. అలాగే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో అచ్చంపేట, తాళ్లచెరువు, కొత్తపల్లి గ్రామాలలో.. కృష్ణాజిల్లాలోని చందర్లపాడు, కంచికచెర్ల, వీరులపాడు, జగ్గయ్యపేట.. నందిగామ మండలాల్లో అర్ధరాత్రి 2.37 గంటల సమయంలో భూమి 10 సెకెన్ల పాటు భూమి కంపించింది.
ఇక దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.7గా నమోదైంది. ఇంట్లోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో ప్రజలు భయాందోళనలతో బయటికి పరుగులు తీశారు. అయితే ఇవి చిన్న ప్రకంపనలేనని… వీటి వల్ల భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కాగా, ఐదేళ్ల కిందట రిపబ్లిక్ డే రోజున ఇలాగే ఖమ్మంలోని పాతర్లపాడు, నాగులవంచ గ్రామాల్లో భూమి కంపించింది అక్కడి గ్రామస్థులు చెప్పడం గమనార్హం.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







