పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లింది
- January 19, 2016
పీఎస్ఎల్వీ సీ-31 ప్రయోగం వి జయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన నెల్లూరు జిల్లాలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈరోజు ఉదయం 9.31గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ31(పీఎస్ఎల్వీ) వాహక నౌకను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్డౌన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమై 48గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన పిదప పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన 1,425 కిలోల ఐఆర్ ఎన్ఎస్ఎస్-1ఇ ఉప గ్రహాన్ని పీఎస్ఎల్వీ సీ31 వాహకనౌక 19 నిమిషాల 30సెకన్లలో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 2016 తొలి అంకంలో ఇస్రో సాధించిన ఘన విజయమని శాస్రవేత్తలు ప్రకటించారు. పీఎస్ఎల్వీ మరోసారి నమ్మకాన్ని నిలబెట్దిందని పేర్కొన్నారు. మరో రెండున్న నెలల్లో మిగతా 2 ఉపగ్రహాలను ప్రయోగిస్తామని తెలిపారు. 2016 చివరినాటికి స్వదేశీ దిక్చూచిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. తాజా ఉపగ్రహంతో గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్(జీపీఎస్)కు మరింత వూతం లభించనుంది. భూ స్థిర కక్ష్యకు 36వేల కిలోమీటర్ల ఎత్తున ఉపగ్రహాన్ని రోదసీలో నిలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









