గాయకుడు ఏసుదాస్ సోదరుడు మృతి
- February 07, 2020
కేరళ:ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్ సోదరుడు కేజే జస్టిన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొచ్చిలోని బ్యాక్ వాటర్స్ వద్ద ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కొచ్చిన్ వల్లపాడమ్ కంటైనర్ టెర్మినల్ వద్ద ఆయన శవం తేలుతూ కనిపించింది. అయితే జస్టిన్ బుధవారం ఉదయం చర్చికి వెళ్లి.. రాత్రి వరకూ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకగా.. వెతకగా... ఎంతకీ దొరక్కపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. బ్యాక్ వాటర్స్ వద్ద ఆయన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే జస్టిన్ కొడుకు అకాల మరణం చెందడం, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే జస్టిన్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. కేజే జస్టిన్ సంగీతకారుడు, రచయిత కూడా.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







