యూ.ఏ.ఈ:ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారి బంపర్ ఆఫర్
- February 07, 2020
దుబాయ్:యూ.ఏ.ఈ లో భారతీయులకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సంస్థ శుభవార్త చెప్పింది.యూ.ఏ.ఈ లో ఉంటున్న వారి కోసం ఫ్లాష్ సేల్ను ప్రారంభించిన సంస్థ.. తక్కువ ఖర్చుతో ఇండియాకు వచ్చేందుకు వీలు కల్పించింది. కేవలం 269దిర్హామ్స్ తో షార్జా నుంచి ముంబాయికు ప్రయాణించొచ్చని వెల్లడించింది.అంతేకాకుండా.. దుబాయ్-ముంబాయి టికెట్ ధర 289 దిర్హామ్స్ , దుబాయ్/షార్జా - కొజికోడ్ టికెట్ ధర 279 దిర్హామ్స్గా నిర్ణయించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ ప్రకటించింది.అయితే ఈ ఫ్లాష్ సేల్ ఫిబ్రవరి 6-10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ తేదీల మధ్య టికెట్ను బుక్ చేసుకున్న వారు ఫిబ్రవరి 6- అక్టోబర్ 24 మధ్య కాలంలో ప్రయాణించొచ్చని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు