యూ.ఏ.ఈ:ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వారి బంపర్ ఆఫర్

- February 07, 2020 , by Maagulf
యూ.ఏ.ఈ:ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వారి బంపర్ ఆఫర్

దుబాయ్:యూ.ఏ.ఈ లో భారతీయులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థ శుభవార్త చెప్పింది.యూ.ఏ.ఈ లో ఉంటున్న వారి కోసం ఫ్లాష్ సేల్‌ను ప్రారంభించిన సంస్థ.. తక్కువ ఖర్చుతో ఇండియాకు వచ్చేందుకు వీలు కల్పించింది. కేవలం 269దిర్హామ్స్‌ తో షార్జా నుంచి ముంబాయికు ప్రయాణించొచ్చని వెల్లడించింది.అంతేకాకుండా.. దుబాయ్-ముంబాయి టికెట్ ధర 289 దిర్హామ్స్ , దుబాయ్/షార్జా - కొజికోడ్‌ టికెట్ ధర 279 దిర్హామ్స్‌గా నిర్ణయించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ ప్రకటించింది.అయితే ఈ ఫ్లాష్ సేల్ ఫిబ్రవరి 6-10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ తేదీల మధ్య టికెట్‌ను బుక్ చేసుకున్న వారు ఫిబ్రవరి 6- అక్టోబర్ 24 మధ్య కాలంలో ప్రయాణించొచ్చని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com