కేరళ: వరద బాధితుల కోసం సిద్ధమైన 250 జోయ్ హోమ్స్..
- February 12, 2020బహ్రెయిన్:కేరళ వరద బాధితుల కోసం మేము సైతం అంటూ ముందుకొచ్చింది జోయాలుక్కాస్ ఫౌండేషన్. వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారి కోసం జాయ్ హోమ్స్ పేరుతో 250 ఇళ్లను నిర్మించి బాధితులకు అప్పగించింది. 15 కోట్ల రూపాయలతో ఈ మెగా ప్రాజెక్టును చేపట్టింది. ఒక్కో ఇంటిని దాదాపు ఆరు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. నిర్వాసితులకు కోసం జోయ్ హోమ్స్ పేరుతో జోయాలుక్కాస్ ఫౌండేషన్ అందించిన సాయం అతి గొప్పదని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశంసించారు. జోయ్ హోమ్స్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం..ఫౌండేషన్ సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. 2018 ఆగస్ట్ లో సంభవించిన వరదల్లో వందలాది మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. కేరళ పున: నిర్మాణానికి తోడ్పాటు అందించాలన్న తమ పిలుపుతో వరద బాధితులకు జోయాలుక్కాస్ అందించిన సేవలు మరువలేమని సీఎం పినరయి విజయన్ అన్నారు. అంతేకాదు..నిరాశ్రయులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన జోయాలుక్కాస్ ఫౌండేషన్ నిర్వాసితుల కోసం 250 ఇళ్లను నిర్మించింది. ప్రస్తుతానికి 160 కుటుంబాలు జోయ్ హోమ్స్ కు షిప్ట్ అవగా..మిగిలిన లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లను అప్పగిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా