ఒకటి కంటే ఎక్కువ పాన్కార్డ్లు ఉంటే..భారీ జరిమానా
- February 12, 2020
ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139 ఎ ప్రకారం ఒక వ్యక్తి ఒకే పాన్ నంబర్ ను కలిగి ఉండడానికి అర్హులు. ఈ నిబంధనను అతిక్రమించిన వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ చర్యలను తీసుకోనుంది. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్లను కలిగిన వారికి రూ.10,000 జరిమానా విధించాలని ఆ శాఖ నిర్ణయించింది. అయితే వివిధ కారణాల వలన ఒకటి కన్నా ఎక్కువ పాన్కార్డులను కలిగి ఉన్నవారు…తమ వద్ద అదనంగా ఉన్న పాన్కార్డులను స్వాధీనం చేయటం ద్వారా ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఆదాయపుపన్ను శాఖ కలిగించింది. వారు అటువంటి కార్డులను ప్రభుత్వానికి వెంటనే సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.
ప్రవాస భారతీయుల వద్ద ఎక్కువ పాన్ కార్డుల ఉండే అవకాశం ఉంది, వారు చాలా సంవత్సరాల తరువాత దేశాన్ని సందర్శించిన తరువాత వారి పేరు మీద మరొక పాన్ కార్డును పొందవచ్చు.అంతేకాకుండా తమ పాన్ కార్డులో ఉన్న వివరాల్లో తప్పులు ఉన్నప్పుడు… వాటిని సరిచేయవచ్చు. దానికి బదులు కొందరు మరో కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారు. తొలికార్డును స్వాధీనం చేయకుండానే మరోదాన్ని పొందుతారు.
వినియోగదారులు ఆదాయపు పన్ను విభాగం యొక్క వెబ్సైట్ను సందర్శించి, 'సరెండర్ డూప్లికేట్ పాన్' కింద క్లిక్ చేయాలి. అప్పుడు మీరు స్వాధీనం చేయవలసిన పాన్ కార్డు, మీరు నిలుపుకోవాలనుకునే పాన్ కార్డు యొక్క అవసరమైన వివరాలను పూరించమని అడుగుతారు. ఈ విధంగా ఆన్ లైన్, ఆఫ్లైన్ … రెండు విధానాల ద్వారా తప్పని సరిగా అదనపు పాన్ కార్డులను స్వాధీనం చేయవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!







