ఒకటి కంటే ఎక్కువ పాన్కార్డ్లు ఉంటే..భారీ జరిమానా
- February 12, 2020ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139 ఎ ప్రకారం ఒక వ్యక్తి ఒకే పాన్ నంబర్ ను కలిగి ఉండడానికి అర్హులు. ఈ నిబంధనను అతిక్రమించిన వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ చర్యలను తీసుకోనుంది. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్లను కలిగిన వారికి రూ.10,000 జరిమానా విధించాలని ఆ శాఖ నిర్ణయించింది. అయితే వివిధ కారణాల వలన ఒకటి కన్నా ఎక్కువ పాన్కార్డులను కలిగి ఉన్నవారు…తమ వద్ద అదనంగా ఉన్న పాన్కార్డులను స్వాధీనం చేయటం ద్వారా ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఆదాయపుపన్ను శాఖ కలిగించింది. వారు అటువంటి కార్డులను ప్రభుత్వానికి వెంటనే సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.
ప్రవాస భారతీయుల వద్ద ఎక్కువ పాన్ కార్డుల ఉండే అవకాశం ఉంది, వారు చాలా సంవత్సరాల తరువాత దేశాన్ని సందర్శించిన తరువాత వారి పేరు మీద మరొక పాన్ కార్డును పొందవచ్చు.అంతేకాకుండా తమ పాన్ కార్డులో ఉన్న వివరాల్లో తప్పులు ఉన్నప్పుడు… వాటిని సరిచేయవచ్చు. దానికి బదులు కొందరు మరో కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారు. తొలికార్డును స్వాధీనం చేయకుండానే మరోదాన్ని పొందుతారు.
వినియోగదారులు ఆదాయపు పన్ను విభాగం యొక్క వెబ్సైట్ను సందర్శించి, 'సరెండర్ డూప్లికేట్ పాన్' కింద క్లిక్ చేయాలి. అప్పుడు మీరు స్వాధీనం చేయవలసిన పాన్ కార్డు, మీరు నిలుపుకోవాలనుకునే పాన్ కార్డు యొక్క అవసరమైన వివరాలను పూరించమని అడుగుతారు. ఈ విధంగా ఆన్ లైన్, ఆఫ్లైన్ … రెండు విధానాల ద్వారా తప్పని సరిగా అదనపు పాన్ కార్డులను స్వాధీనం చేయవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు