కేరళ: వరద బాధితుల కోసం సిద్ధమైన 250 జోయ్ హోమ్స్..
- February 12, 2020
బహ్రెయిన్:కేరళ వరద బాధితుల కోసం మేము సైతం అంటూ ముందుకొచ్చింది జోయాలుక్కాస్ ఫౌండేషన్. వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారి కోసం జాయ్ హోమ్స్ పేరుతో 250 ఇళ్లను నిర్మించి బాధితులకు అప్పగించింది. 15 కోట్ల రూపాయలతో ఈ మెగా ప్రాజెక్టును చేపట్టింది. ఒక్కో ఇంటిని దాదాపు ఆరు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. నిర్వాసితులకు కోసం జోయ్ హోమ్స్ పేరుతో జోయాలుక్కాస్ ఫౌండేషన్ అందించిన సాయం అతి గొప్పదని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశంసించారు. జోయ్ హోమ్స్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం..ఫౌండేషన్ సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. 2018 ఆగస్ట్ లో సంభవించిన వరదల్లో వందలాది మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. కేరళ పున: నిర్మాణానికి తోడ్పాటు అందించాలన్న తమ పిలుపుతో వరద బాధితులకు జోయాలుక్కాస్ అందించిన సేవలు మరువలేమని సీఎం పినరయి విజయన్ అన్నారు. అంతేకాదు..నిరాశ్రయులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన జోయాలుక్కాస్ ఫౌండేషన్ నిర్వాసితుల కోసం 250 ఇళ్లను నిర్మించింది. ప్రస్తుతానికి 160 కుటుంబాలు జోయ్ హోమ్స్ కు షిప్ట్ అవగా..మిగిలిన లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లను అప్పగిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







