కేరళ: వరద బాధితుల కోసం సిద్ధమైన 250 జోయ్ హోమ్స్..
- February 12, 2020
బహ్రెయిన్:కేరళ వరద బాధితుల కోసం మేము సైతం అంటూ ముందుకొచ్చింది జోయాలుక్కాస్ ఫౌండేషన్. వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారి కోసం జాయ్ హోమ్స్ పేరుతో 250 ఇళ్లను నిర్మించి బాధితులకు అప్పగించింది. 15 కోట్ల రూపాయలతో ఈ మెగా ప్రాజెక్టును చేపట్టింది. ఒక్కో ఇంటిని దాదాపు ఆరు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. నిర్వాసితులకు కోసం జోయ్ హోమ్స్ పేరుతో జోయాలుక్కాస్ ఫౌండేషన్ అందించిన సాయం అతి గొప్పదని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశంసించారు. జోయ్ హోమ్స్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం..ఫౌండేషన్ సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. 2018 ఆగస్ట్ లో సంభవించిన వరదల్లో వందలాది మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. కేరళ పున: నిర్మాణానికి తోడ్పాటు అందించాలన్న తమ పిలుపుతో వరద బాధితులకు జోయాలుక్కాస్ అందించిన సేవలు మరువలేమని సీఎం పినరయి విజయన్ అన్నారు. అంతేకాదు..నిరాశ్రయులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన జోయాలుక్కాస్ ఫౌండేషన్ నిర్వాసితుల కోసం 250 ఇళ్లను నిర్మించింది. ప్రస్తుతానికి 160 కుటుంబాలు జోయ్ హోమ్స్ కు షిప్ట్ అవగా..మిగిలిన లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లను అప్పగిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!