దోహ: ఖతార్ కు తమిళనాడు నుంచి ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్

- February 12, 2020 , by Maagulf
దోహ: ఖతార్ కు తమిళనాడు నుంచి ఫస్ట్ డైరెక్ట్  ఫ్లైట్

ఇండియన్ బడ్జెట్ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఖతార్ కు డైరెక్ట్ ఫ్లైట్ ఆపరేట్ చేయనుంది. మార్చి 31 నుంచి కొత్త సర్వీస్ ప్రారంభం కాబోతోంది. తమిళనాడులోని తిరుచిరపల్లి నుంచి దోహా మధ్య నడవనుంది. వారంలో మూడు రోజులు ఫ్లైట్ ఆపరేట్ చేస్తారు. మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో ఈ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. దోహలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి తెల్లవారుజామున 4.40(లోకల్ టైం) కి బయలుదేరి 11.45గంటలకు (ఇండియన్ లోకల్ టైం) తిరుచిరపల్లికి చేరుకుంటుంది. మళ్లీ అర్ధరాత్రి ఒకటిన్నరకు తిరుచిరపల్లిలో బయల్దేరి దోహాకు 3.40(దోహ లోకల్ టైం) గంటలకు చేరుకుంటుంది. తిరుచిరపల్లి-దోహా డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ కు ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com