ఉగ్రనిధుల కేసులో హఫీజ్ సయీద్కు ఐదేళ్లు జైలు
- February 12, 2020
ఇస్లామాబాద్: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసుల్లో కరడుకట్టిన ఉగ్రవాది, జమాత్- ఉద్-దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ను పాక్ కోర్టు బుధవారంనాడు దోషిగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది. ఐదేళ్లు జైలుశిక్ష విధించింది. 2008లో 166 మంది ప్రాణాలు కోల్పోయిన ముంబై ఉగ్రపేలుళ్ల కేసులో హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు.
పారిస్లో ఫైనాన్స్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఏఫ్) ప్లీనరీ జరుగబోతున్న తరుణంలో దీనికి రెండ్రోజుల ముందు పాక్ కోర్టు తాజా తీర్పు ఇచ్చింది. పారిస్ ప్లీనరీలో పాక్ను బ్లాక్లిస్టులో లేదా గ్రేలిస్ట్లో పెట్టే విషయంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. సయీద్ను పాక్ కోర్టు రెండు కేసుల్లో దోషిగా నిర్ధారించడంతో పాటు ఒక్కో కేసుకు రూ.15,000 చొప్పున జరిమానా కూడా విధించింది. ఈ రెండు కేసుల్లోనూ ఐదేళ్ల జైలుశిక్ష ఏకకాలంలో అమలు అవుతుంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







