ఉగ్రనిధుల కేసులో హఫీజ్ సయీద్కు ఐదేళ్లు జైలు
- February 12, 2020
ఇస్లామాబాద్: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసుల్లో కరడుకట్టిన ఉగ్రవాది, జమాత్- ఉద్-దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ను పాక్ కోర్టు బుధవారంనాడు దోషిగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది. ఐదేళ్లు జైలుశిక్ష విధించింది. 2008లో 166 మంది ప్రాణాలు కోల్పోయిన ముంబై ఉగ్రపేలుళ్ల కేసులో హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు.
పారిస్లో ఫైనాన్స్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఏఫ్) ప్లీనరీ జరుగబోతున్న తరుణంలో దీనికి రెండ్రోజుల ముందు పాక్ కోర్టు తాజా తీర్పు ఇచ్చింది. పారిస్ ప్లీనరీలో పాక్ను బ్లాక్లిస్టులో లేదా గ్రేలిస్ట్లో పెట్టే విషయంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. సయీద్ను పాక్ కోర్టు రెండు కేసుల్లో దోషిగా నిర్ధారించడంతో పాటు ఒక్కో కేసుకు రూ.15,000 చొప్పున జరిమానా కూడా విధించింది. ఈ రెండు కేసుల్లోనూ ఐదేళ్ల జైలుశిక్ష ఏకకాలంలో అమలు అవుతుంది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







