ఫోన్ స్కామ్: 200,000 దిర్హామ్ లు రికవరీ చేసిన దుబాయ్ పోలీస్
- February 12, 2020
ఫోన్ స్కామ్ కారణంగా 200,000 దిర్హామ్ లు పోగొట్టుకున్న బాధితుడికి దుబాయ్ పోలీసులు న్యాయం చేశారు. కేసు వివరాల్లోకి వెళితే, బాధితుడొకరు తన భార్య ఫోన్కి ‘200,000 దిర్హామ్ ల బహుమతి వచ్చింది’ అనే ఆడియో మేజేస్ రావడంతో, ఆ ఆడియో మెసేజ్లో పేర్కొన్న విధంగా ఐడీ, ఏటీఎం కార్డ్ వివరాల్ని పంపించారు. అయితే, బహుమతి రాకపోగా, తన అకౌంట్లో నుంచి డబ్బులు పోగొట్టుకున్నట్లు బాధితుడు ఆ తర్వాత గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, బాధితుడు పోగొట్టుకున్న డబ్బుని రికవర్ చేయగలిగారు. ఈ సందర్భంగా పోలీసులకు బాధిత వ్యక్తి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 28 ఫ్రాడ్స్టర్స్, 13 ఇతర గ్యాంగ్లను ఈ తరహా ఫోన్ స్కావ్ులకు సంబంధించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







