ఫోన్ స్కామ్: 200,000 దిర్హామ్ లు రికవరీ చేసిన దుబాయ్ పోలీస్
- February 12, 2020
ఫోన్ స్కామ్ కారణంగా 200,000 దిర్హామ్ లు పోగొట్టుకున్న బాధితుడికి దుబాయ్ పోలీసులు న్యాయం చేశారు. కేసు వివరాల్లోకి వెళితే, బాధితుడొకరు తన భార్య ఫోన్కి ‘200,000 దిర్హామ్ ల బహుమతి వచ్చింది’ అనే ఆడియో మేజేస్ రావడంతో, ఆ ఆడియో మెసేజ్లో పేర్కొన్న విధంగా ఐడీ, ఏటీఎం కార్డ్ వివరాల్ని పంపించారు. అయితే, బహుమతి రాకపోగా, తన అకౌంట్లో నుంచి డబ్బులు పోగొట్టుకున్నట్లు బాధితుడు ఆ తర్వాత గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, బాధితుడు పోగొట్టుకున్న డబ్బుని రికవర్ చేయగలిగారు. ఈ సందర్భంగా పోలీసులకు బాధిత వ్యక్తి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 28 ఫ్రాడ్స్టర్స్, 13 ఇతర గ్యాంగ్లను ఈ తరహా ఫోన్ స్కావ్ులకు సంబంధించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







