164 పేద రోగుల కోసం 220,000 దిర్హాముల విరాళమిచ్చిన ఎమిరాతి
- February 13, 2020
రాస్ అల్ ఖైమా:ఎమిరాతి బిజినెస్ మేన్ ఖాలిద్ అబ్దుల్లా యూసుఫ్ 220,000 దిర్హాములను 164 మంది పేద రోగుల వైద్య చికిత్స కోసం విరాళంగా అందించారు. షేక్ ఖలీఫా స్పెషాలిటీ ఆసుపత్రిలో బాధితులు వైద్య చికిత్స పొందుతున్నారు. వీరెవరూ వైద్య చికిత్సలకయ్యే ఖర్చుని భరించే పరిస్థితుల్లో లేరు. వారి దయనీయ పరిస్థితి గురించి తెలుసుకున్న యూసుఫ్, వారందరి వైద్య చికిత్సలకయ్యే ఖర్చుని భరించేందుకు ముందుకొచ్చారు. యూఏఈ ఫౌండర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ స్ఫూర్తితో తాను ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు యూసుఫ్. కాగా, సాయం అందుకోనున్న రోగులు, తమకు సాయం ప్రకటించిన యూసుఫ్కి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, షేక్ ఖలీఫా స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్, తమకు 220,000 దిర్హాముల చెక్ అందిందని ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







