164 పేద రోగుల కోసం 220,000 దిర్హాముల విరాళమిచ్చిన ఎమిరాతి
- February 13, 2020
రాస్ అల్ ఖైమా:ఎమిరాతి బిజినెస్ మేన్ ఖాలిద్ అబ్దుల్లా యూసుఫ్ 220,000 దిర్హాములను 164 మంది పేద రోగుల వైద్య చికిత్స కోసం విరాళంగా అందించారు. షేక్ ఖలీఫా స్పెషాలిటీ ఆసుపత్రిలో బాధితులు వైద్య చికిత్స పొందుతున్నారు. వీరెవరూ వైద్య చికిత్సలకయ్యే ఖర్చుని భరించే పరిస్థితుల్లో లేరు. వారి దయనీయ పరిస్థితి గురించి తెలుసుకున్న యూసుఫ్, వారందరి వైద్య చికిత్సలకయ్యే ఖర్చుని భరించేందుకు ముందుకొచ్చారు. యూఏఈ ఫౌండర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ స్ఫూర్తితో తాను ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు యూసుఫ్. కాగా, సాయం అందుకోనున్న రోగులు, తమకు సాయం ప్రకటించిన యూసుఫ్కి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, షేక్ ఖలీఫా స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్, తమకు 220,000 దిర్హాముల చెక్ అందిందని ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







