164 పేద రోగుల కోసం 220,000 దిర్హాముల విరాళమిచ్చిన ఎమిరాతి

- February 13, 2020 , by Maagulf
164 పేద రోగుల కోసం 220,000 దిర్హాముల విరాళమిచ్చిన ఎమిరాతి

రాస్ అల్ ఖైమా:ఎమిరాతి బిజినెస్‌ మేన్‌ ఖాలిద్‌ అబ్దుల్లా యూసుఫ్‌ 220,000 దిర్హాములను 164 మంది పేద రోగుల వైద్య చికిత్స కోసం విరాళంగా అందించారు. షేక్‌ ఖలీఫా స్పెషాలిటీ ఆసుపత్రిలో బాధితులు వైద్య చికిత్స పొందుతున్నారు. వీరెవరూ వైద్య చికిత్సలకయ్యే ఖర్చుని భరించే పరిస్థితుల్లో లేరు. వారి దయనీయ పరిస్థితి గురించి తెలుసుకున్న యూసుఫ్‌, వారందరి వైద్య చికిత్సలకయ్యే ఖర్చుని భరించేందుకు ముందుకొచ్చారు. యూఏఈ ఫౌండర్‌ షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ స్ఫూర్తితో తాను ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు యూసుఫ్‌. కాగా, సాయం అందుకోనున్న రోగులు, తమకు సాయం ప్రకటించిన యూసుఫ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, షేక్‌ ఖలీఫా స్పెషాలిటీ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, తమకు 220,000 దిర్హాముల చెక్‌ అందిందని ప్రకటించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com