షూటవుట్: ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలు
- February 22, 2020
మదీనా: సౌదీ గన్ మెన్ తో జరిగిన కాల్పుల నేపథ్యంలో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి తీవ్రగాయాలయ్యయి. ఈ మేరకు మదీనా రీజియన్ పోలీస్ అధికార ప్రతినిథి ఓ ప్రకటన విడుదల చేశారు. సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరుపుతూ నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, అతన్ని నిలువరించే ప్రయత్నంలో సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. అంతకు ముందు నిందితుడి కాల్పులపై సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందడంతో, అతన్ని నిలువరించేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు సెక్యూరిటీ సిబ్బంది. ఈ ఘటనలో గాయపడ్డ సెక్యూరిటీ సిబ్బందికి వైద్య చికిత్స అందుతోంది. నిందితుడి వివరాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు కాల్పులు జరపడానికి గల కారణాలేమిటి.? అన్నదానిపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







