అబుధాబి: ఇండియన్ పాస్ పోర్ట్ రెన్యూవల్ స్పెషల్ డ్రైవ్
- February 25, 2020
అబుధాబి:ఇండియన్ పాస్ పోర్ట్ రెన్యూవల్ చేసేందుకు ఇండియన్ ఎంబసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ నెల 28(శుక్రవారం) రోజు రువైస్ హౌజింగ్, 1 గెస్ట్ హౌజ్ లోని సెకండ్ ఫ్లోర్ కాన్పరెన్స్ రూమ్ లో రెన్యూవల్ కార్యక్రమం చేపట్టనుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. లాస్ట్ టోకెన్ మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఇవ్వనున్నట్లు ఎంబసీ తన ప్రకటనలో తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రవాసీయులు సద్వినియోగం చేసుకోవాలని ఎంబీసీ అధికారులు కోరారు. మరింత సమాచారం కోసం పాస్ పోర్ట్, వీసా ప్రొసిజర్ అప్లికేషన్స్ కోసం ఎంబసీ వెబ్ సైట్ http://www.indembassyuae.gov.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. అలాగే 024492700 నెంబర్ కు ఆదివారం నుంచి గురువారం వరకు ఫోన్ చేసి వివరాలు తెలుకోవచ్చని తెలిపారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







