కువైట్ పబ్లిక్ సెక్టార్లో కొనసాగుతున్న పనులు
- February 29, 2020
కువైట్:పబ్లిక్ సెక్టార్లో వర్క్ యధాతథంగా కొనసాగుతోందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆపే ప్రసక్తి లేదని కువైట్ గవర్నమెంట్ అధికారిక ప్రతినిది¸ తారెక్ అల్ మెజ్రేం చెప్పారు. పౌరుల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాద్యతాయుతంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు అల్ మెజ్రేం వివరించారు. స్కూళ్ళకు సెలవులు ఇవ్వడం దగ్గర్నుంచి, పలు చర్యలు తీసుకోవడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు తెలిపారాయన. కాగా, కరోనా వైరస్తో బాధపడుతున్నవారికి మెరుగైన వైద్యం అందుతోందనీ, అందరి పరిస్థితీ నిలకడగా వుందనీ చెప్పారు హెల్త్ మినిస్ట్రీ అధికార ప్రతినిది¸ డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్. పబ్లిక్ సెక్టార్లో వున్నవారంతా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి వుంటుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







