రమదాన్ వరకూ కరోనా కల్లోలం?
- March 02, 2020
కువైట్: కువైట్లో కరోనాతో బాధపడుతున్నవారి సంఖ్య 46కి చేరుకుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇరాన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిలో కొత్తగా కరోనా వైరస్ని కనుగొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వైరస్ తొలిసారిగా దేశంలో కనుగొనబడినప్పటినుంచీ అత్యంత పకడ్బందీగా ఈ వైరస్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో పరిస్థితి కొంత అదుపులోనే వున్నట్లు కన్పిస్తోంది. పూర్తిగా కరోనా కేసులు జీరో అయ్యేదాకా కరోనాపై పోరాటం ఆగబోదని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా, త్వరలో రమదాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఐసోలేషన్ పద్ధతిలోనే వేడుకలు జరుగుతాయా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎక్కువగా జనం గుమి కూడే అవకాశం వుంటుంది కాబట్టి, ఈలోగా కరోనా పూర్తిగా అంతమైతే తప్ప.. రమదాన్ వేడుకల్లో ఈసారి భిన్నమైన పరిస్థితులు వుండొచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..