రమదాన్ వరకూ కరోనా కల్లోలం?
- March 02, 2020
కువైట్: కువైట్లో కరోనాతో బాధపడుతున్నవారి సంఖ్య 46కి చేరుకుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇరాన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిలో కొత్తగా కరోనా వైరస్ని కనుగొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వైరస్ తొలిసారిగా దేశంలో కనుగొనబడినప్పటినుంచీ అత్యంత పకడ్బందీగా ఈ వైరస్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో పరిస్థితి కొంత అదుపులోనే వున్నట్లు కన్పిస్తోంది. పూర్తిగా కరోనా కేసులు జీరో అయ్యేదాకా కరోనాపై పోరాటం ఆగబోదని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా, త్వరలో రమదాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఐసోలేషన్ పద్ధతిలోనే వేడుకలు జరుగుతాయా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎక్కువగా జనం గుమి కూడే అవకాశం వుంటుంది కాబట్టి, ఈలోగా కరోనా పూర్తిగా అంతమైతే తప్ప.. రమదాన్ వేడుకల్లో ఈసారి భిన్నమైన పరిస్థితులు వుండొచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







