హైద్రాబాద్లో తొలి కరోనా వైరస్ కేసు నమోదు
- March 03, 2020
భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్లో కరోనా వైరస్కి సంబంధించి తొలి పాజిటివ్ కేసు నమోదయ్యింది. బాధితుడ్ని 24 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా గుర్తించారు. ఆఫీస్ వర్క్ నిమిత్తం ఇటీవల దుబాయ్కి వెళ్ళి వచ్చిన ఆ వ్యక్తి, అక్కడి నుంచి బెంగళూరుకి చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. బెంగళూరులో రెండ్రోజులు ఆఫీస్కి వెళ్ళాడనీ, ఆ తర్వాత ఆయన హైద్రాబాద్ రావడం జరిగిందనీ, జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన అతనికి తొలుత స్వైన్ఫ్లూ అనే అనుమానంతో వైద్య చికిత్స అందించగా, ఫలితమివ్వకపోవడంతో గాంధీ హాస్పిటల్కి తరలించారు. అక్కడే అతనికి కోవిడ్ (కరోనా వైరస్) పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ అని తేలింది. దుబాయ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు విదేశీయుల్ని కలవడం వల్ల బాధితుడికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఇండియాకి వచ్చిన దగ్గర్నుంచి ఎవరెవర్ని అతను కలిశాడన్నదానిపై ఆరా తీస్తున్న అధికారులు, కొందరికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుంది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







