హైద్రాబాద్లో తొలి కరోనా వైరస్ కేసు నమోదు
- March 03, 2020
భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్లో కరోనా వైరస్కి సంబంధించి తొలి పాజిటివ్ కేసు నమోదయ్యింది. బాధితుడ్ని 24 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా గుర్తించారు. ఆఫీస్ వర్క్ నిమిత్తం ఇటీవల దుబాయ్కి వెళ్ళి వచ్చిన ఆ వ్యక్తి, అక్కడి నుంచి బెంగళూరుకి చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. బెంగళూరులో రెండ్రోజులు ఆఫీస్కి వెళ్ళాడనీ, ఆ తర్వాత ఆయన హైద్రాబాద్ రావడం జరిగిందనీ, జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన అతనికి తొలుత స్వైన్ఫ్లూ అనే అనుమానంతో వైద్య చికిత్స అందించగా, ఫలితమివ్వకపోవడంతో గాంధీ హాస్పిటల్కి తరలించారు. అక్కడే అతనికి కోవిడ్ (కరోనా వైరస్) పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ అని తేలింది. దుబాయ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు విదేశీయుల్ని కలవడం వల్ల బాధితుడికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఇండియాకి వచ్చిన దగ్గర్నుంచి ఎవరెవర్ని అతను కలిశాడన్నదానిపై ఆరా తీస్తున్న అధికారులు, కొందరికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుంది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







