ఒమన్:ఫోన్ కోసం సూసైడ్ చేసుకున్న 14 ఏళ్ల బాలుడు
- March 04, 2020
ఒమన్ లో 14 ఏళ్ల బాలుడు మోటర్ బైక్ టైర్ ట్యూబ్ తో ఉరి వేసుకొని చనిపోయాడు. మంగళవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తన రూంలోనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ విషయంలో తన తండ్రి మందలించటం వల్లే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాయల్ ఒమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు అల్ ధహిరా గవర్నరేట్లోని విలాయత్ ఇబ్రి నివాసి. లంచ్ టైంలో ఫోన్ విషయంలో తన తండ్రితో అతనికి వాదన జరిగింది. దీంతో మనస్థాపానికి గురైతన అతను రూంలోకి వెళ్లి విపరీత చర్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







